ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఒంగోలు: ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని రోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్యను తక్షణమే తీర్చాలంటూ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ డైరెక్టర్ను ఆదేశించారు.