జిల్లాలో ఎనిమిదో రోజు గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం జోరుగా సాగింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ఎనిమిదో రోజు గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం జోరుగా సాగింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వరికూటి అమృతపాణి వేటపాలెం మండలం దేశాయిపేటలో గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్ పీసీపల్లి మండలం పెదఇర్లపాడులో గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఇంకొల్లు మండలం హనుమోజిపాలెంలో, కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు జరుగుమల్లి మండలం వర్ధినేనిపాలెంలో, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి అర్థవీడు మండలం చీమలేటిపల్లిలో గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు.