
మయూరిసెంటర్లో నివాళులు అర్పిస్తున్న దృశ్యం
కశ్మీర్లోని యురీ సైనిక బేస్క్యాంపుపై పాక్ ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన భారత జవాన్లకు మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ఖమ్మం అర్బన్ : కశ్మీర్లోని యురీ సైనిక బేస్క్యాంపుపై పాక్ ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన భారత జవాన్లకు మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన కార్పొరేషన్ కార్యాలయం, బస్టాండ్ మీదుగా మయూరిసెంటర్ వరకు సాగింది. మయూరిసెంటర్ వద్ద జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి మాట్లాడుతూ పాక్ ఉగ్రవాదులు యూరిలోని భారత సైనిక స్థావరంపై దాడి చేసి నిద్రలో ఉన్న సైనికులపై గ్రెనేడ్ దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. మృతిచెందిన సైనికుల కుటుంబాలకు మద్దతుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి.. నివాళులు అర్పించినట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాకిస్థాన్ ఉగ్రవాదులపై కంటితుడుపు చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్ను ఏకాకిని చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాక్ ఉపక్రమించకుండా గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలస్యం సుధాకర్, నగర ప్రధాన కార్యదర్శి జమలాపురం రామకృష్ణ, నగర యూత్ అధ్యక్షుడు రాజ్వర్దన్రెడ్డి, తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు వాలూరి సత్యనారాయణ, నగర నాయకులు గోళ్లమూడి లక్ష్మీనారాయణ, డివిజన్ అధ్యక్షుడు ఆలస్యం రవి, ఎస్కే ఫరీద్, ఎస్కే యాకూబ్, పత్తిపాటి అప్పారావు, బి.సుందర్, కొవ్వూరి శ్రీనివాసరావు, బాలశౌరి, గోపిరెడ్డి, రేవంత్, నాగిరెడ్డి, నాగుల్మీరా, ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, పత్తిపాటి వీరయ్య, రావూరి వెంకటేశ్వర్లు, ఎ.ఉపేందర్రావు, యాకా లక్ష్మీ పాల్గొన్నారు.