పాల్వంచ మండలం ఉల్లనూరు పంచాయతీ మల్లారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
పాల్వంచ రూరల్(ఖమ్మం జిల్లా): పాల్వంచ మండలం ఉల్లనూరు పంచాయతీ మల్లారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాలం సమ్మక్క(52) అనే మహిళ విష జ్వరంతో గురువారం ఉదయం మృతిచెందింది. ఐదు రోజులుగా సమ్మక్క జ్వరంతో బాధపడుతోంది.
పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి నిన్న సాయంత్రం(బుధవారం) తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది.