ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్కార్పియోను ఢీకొట్టిన బస్సు: మహిళ మృతి
Jul 28 2016 12:53 PM | Updated on Aug 30 2018 4:07 PM
పులిచర్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరులో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పొద్దుటూరు నుంచి చిత్తూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కనుమ దారిలో చెన్నై విమానాశ్రయం నుంచి వస్తున్న స్కార్పియోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా సుండుపల్లికి చెందిన కోనేటి వెంకటమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement