ఇంకుడు గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం డోర్నాల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
ధారూర్(రంగారెడ్డి): ఇంకుడు గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం డోర్నాల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవమ్మ(25) ఇంటి ముందు పని చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి ఇంకుడు గుంతలో పడింది. ఆమెకు ఈత రాకపోవడంతో.. నీట మునిగి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.