- మలేసియాలో తెలంగాణ కార్మికుల అవస్థలు
- ఔట్ పాస్ పోర్టుకోసం వెతలు
మోర్తాడ్(నిజామాబాద్): ఏజెంట్ల మోసాలు, విదేశాంగ శాఖ నిర్లక్ష్యం, అవగాహనలేమి కారణంగా పొట్టకూటికోసం మలేసియా వెళ్లిన తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మలేసియాలోని పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ వేతనాలు ఇస్తామని ఆశ చూపిన ఏజెంట్లు వేలాది మంది కార్మికులను వర్క్ వీసాలు అని చెప్పి విజిట్ వీసాలపై పంపించారు. విజిట్ వీసా జారీ చేసిన స్పాన్సర్ వద్దనే పాస్పోర్టులు ఉంటాయి. కార్మికులు జిరాక్సు కాపీతో మాత్రమే బయట తిరగాల్సి వస్తుంది.
వీసా కోసం కార్మికులు ఒక్కొక్కరు ఏజెంట్లకు రూ.75 వేల నుంచి రూ.1లక్ష వరకు చెల్లించారు. మలేసియా వెళ్లడం కోసం ఎక్కువ వడ్డీకి అప్పు చేసిన కార్మికులు.. విజిట్ వీసాపై వెళ్లినా అక్కడే ఉండి ఎక్కడ పని దొరికితే చాలనుకుని కాలం గడుపుతున్నారు. అయితే, మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పట్టుబడిన కార్మికులు ఇళ్లకు వెళ్లాలంటే అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మంది కార్మికులు మలేసియా జైళ్లు, డిటెన్షన్ సెంటర్లలో ఉండి జరిమానా చెల్లించి ఇళ్లకు చేరుకున్నారు. వలస కార్మికుల సంక్షేమ సంఘం అంచనాల ప్రకారం మలేసియాలో తెలంగాణకు చెందిన దాదాపు 8వేల మంది కార్మికులు వర్క్ పర్మిట్, వీసా లేకుండా ఉన్నారు.
కొద్దిరోజుల కిందట నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్కు చెందిన అమీర్ ఖాన్, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన హన్మంతు ఇంటికి రాగా, కమ్మర్పల్లి మండలం నాగాపూర్కు చెందిన నరేందర్ మాత్రం మలేసియాలోనే ఉండిపోయాడు. సుమారు నాలుగేళ్ల కింద మలేసియాకు విజిట్ వీసాపై వెళ్లిన నరేందర్ అక్కడే పని చేస్తున్నాడు. నరేందర్ ఇంటికి రావడం కోసం ఔట్ పాస్పోర్టు పొందాల్సి ఉంది. ఇండియన్ హైకమిషన్ కార్యాలయానికి వారం కింద వెళ్లగా అక్కడి అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని నరేందర్ 'సాక్షి'కి ఫోన్లో తెలిపాడు. తనతో పాటు చాలా మంది హైకమిషన్ కార్యాలయానికి వెళ్లారని తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తమను ఎలాగైన ఇళ్లకు చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని మలేషియాలో ఉన్న కార్మికులు కోరుతున్నారు. కాగా, విదేశాలలో పని చేస్తున్న మన ప్రాంత కార్మికులకు రాయబార కార్యాలయం ద్వారా ఔట్ పాస్పోర్టు జారీ కావాలంటే పాస్పోర్టు జిరాక్సు కాపీ, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉండాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధి మంద భీమ్రెడ్డి చెప్పారు.
వర్క్ వీసా అన్నారు.. విజిటర్ వీసాపై పంపారు!
Published Fri, Jan 1 2016 8:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement