అదో ‘డొల్ల ప్యాకేజీ’ | vaste package | Sakshi
Sakshi News home page

అదో ‘డొల్ల ప్యాకేజీ’

Sep 19 2016 11:00 PM | Updated on Jul 11 2019 8:34 PM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని డొల్ల ప్యాకేజీగా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని డీసీసీ కార్యాలయంలోని విలేకర్లతో మాట్లాడుతూ విభజన చట్టంలోని కొన్ని హామీలనే ప్యాకేజీలుగా చూపిస్తూ ప్రకటన చేశారని విమర్శించారు. అసలు విభజన చట్టంలో ఏముంది? ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలి

  • కేంద్రమాజీ మంత్రి జేడీ శీలం
  •  
    కాకినాడ :
    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని డొల్ల ప్యాకేజీగా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని డీసీసీ కార్యాలయంలోని విలేకర్లతో మాట్లాడుతూ విభజన చట్టంలోని కొన్ని హామీలనే ప్యాకేజీలుగా చూపిస్తూ ప్రకటన చేశారని విమర్శించారు. అసలు విభజన చట్టంలో ఏముంది?  ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసగిస్తున్న తీరు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ దిశగా కాంగ్రెస్‌ క్యాడర్‌ ప్రత్యేక కరపత్రాలు రూపొందించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. 2019లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం తధ్యమన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement