పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఓ రైతు పొలంలో వరికోత యంత్రంతో కోతలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి వెళ్తున్న కరెంటు తీగలు మిషన్కు తాకాయి. దీంతో షాక్కు గురై యంత్రం నడుపుతున్న జగపతి(26), భాస్కర్రావు(30) అక్కడికక్కడే చనిపోయారు. పవన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.