విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి | Two were killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

Jun 5 2016 11:46 AM | Updated on Sep 5 2018 2:26 PM

ఆగిరిపల్లి పంచాయతీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది

 ఆగిరిపల్లి పంచాయతీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి మాదల గోపాల్ రావు(60), సునీత(25) అనే ఇద్దరు మృతిచెందారు. ఉతికిన బట్టలను ఇనుప వైరుపై ఆరేస్తుండగా కరెంటు షాక్ తగలడంతో సునీత గిజగిజ కొట్టుకుంటుంది. ఇది చూసిన గోపాల్‌రావు ఆమె రక్షించబోయి పట్టుకోబోవడంతో ఆయనకు కూడా షాక్ కొట్టింది.

 

కరెంటు షాక్‌తో ఇద్దరూ ఊగుతుండటంతో గమనించిన స్థానికులు కర్రతో కొట్టారు. అప్పటికే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోపాల్ రావు గొంతులో ప్రాణం ఉందేమోనని ఆశతో ఆయనను విజయవాడకు తరలించారు. కానీ ప్రాణం పోయిందనుకుని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి ఆగిరిపల్లి తీసుకువచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement