పిడుగుపాటుతో ఇద్దరు మృతి | two died with thunder | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో ఇద్దరు మృతి

May 8 2017 12:27 AM | Updated on Jun 4 2019 5:16 PM

పిడుగుపాటుతో కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల ఆదివారం.. ఇద్దరు యువకులు మృతి చెందారు.

మద్దికెర/కొలిమిగుండ్ల(పత్తికొండ, బనగానపల్లె): పిడుగుపాటుతో కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల ఆదివారం.. ఇద్దరు యువకులు మృతి చెందారు.మద్దికెర గ్రామానికి చెందిన విష్ణు (18).. పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడి మృత్యువాత పడ్డాడు. అలాగే కొలిమిగుండ్లకు చెందిన చంద్రశేఖర్‌(20)..దుస్తులు ఉతికేందుకు వెళ్లి  పిడుగుపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతనికి వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ​ప్రొద్దుటూరుకు చెందిన యువతితో జూన్‌ 4వతేదీన వివాహం జరగాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఊహించని రీతిలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement