ఇసుక దిబ్బ విరిగిపడి.. | Two children died after sand mine falls on them | Sakshi
Sakshi News home page

ఇసుక దిబ్బ విరిగిపడి..

May 17 2016 2:02 PM | Updated on Apr 4 2019 4:44 PM

ఇసుక గుంతల వద్ద ఆడుకుంటూ ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

దేవరకొండ: ఇసుక గుంతల వద్ద ఆడుకుంటూ ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులో నివాసం ఉండే ఇస్లావత్ సిద్ధు(7), ఇస్లావత్ మోహన్(7) తమ ఇళ్లకు సమీపంలోనే ఉన్న మైనంపల్లి వాగులో ఆడుకునేందుకు వెళ్లారు. అక్కడ ఇసుక కోసం తవ్విన గుంతలోకి దిగిన వారిద్దరిపై ఒడ్డు విరిగిపడింది. కొద్దిసేపటి తర్వాత వారి కోసం వెదికిన కుటుంబసభ్యులు గుంతలో ఇసుక కింద కూరుకుపోయినట్లు గుర్తించి వెంటనే బయటకు తీశారు. దేవరకొండ ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement