నిధులివ్వడం లేదు.. పార్టీలో చేరితే ఓకేనట | trs governement is not releasing funds: mla rajender reddy | Sakshi
Sakshi News home page

నిధులివ్వడం లేదు.. పార్టీలో చేరితే ఓకేనట

Jul 10 2015 4:56 PM | Updated on Aug 10 2018 8:13 PM

తనపై పగతోనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రావాల్సిన నిధులను ఆపి కొత్త ప్రాజెక్టులకు ఇస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: తనపై పగతోనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రావాల్సిన నిధులను ఆపి కొత్త ప్రాజెక్టులకు ఇస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీలో చేరితో ఐదు రోజుల్లో అంతా సక్కబెడతామంటూ ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనే నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లభించాయని తెలిపారు. జీవో 68తో రూ.1400 కోట్ల నిధులతో భీమా నుంచి 18 టీఎంసీ నీళ్లు తరలించడం లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement