సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటారు.
సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటారు. జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ అభ్యర్థిని జి. మనెమ్మ తన సమీప ప్రత్యర్థి జానా బాయి(కాంగ్రెస్)పై 1395 ఓట్లతో గెలుపొందారు. కిచ్చన్నపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్తి స్వరూప, కాంగ్రెస్ అభ్యర్థి బి. అరుణపై 166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెద్ద శంకరంపేట మండలం జూకల్ 3 వార్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన సున్నం బేటయ్య 4 ఓట్ల తేడాతో విజయం సాధించారు.