ఒకే రోజు మూడు ప్రసవాలు | Three deliveries on the same day | Sakshi
Sakshi News home page

ఒకే రోజు మూడు ప్రసవాలు

Jan 8 2017 10:43 PM | Updated on Sep 5 2017 12:45 AM

ఒకే రోజు మూడు ప్రసవాలు

ఒకే రోజు మూడు ప్రసవాలు

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఒకే రోజు ముగ్గురు గర్భిణులకు వై ద్యులు ప్రసవాలు చేశారు.

రూరల్‌ జిల్లాలో రికార్డు సృష్టించిన సంగెం పీహెచ్‌సీ
జన్మించిన వారిలో  ముగ్గురూ మగ శిశువులే!


సంగెం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో శనివారం ఒకే రోజు ముగ్గురు గర్భిణులకు వైద్యులు ప్రసవాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఒకేరోజు మూడు ప్రసవాలు జరగడం జిల్లాలో రికార్డు కాగా, వైద్యాధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు. గర్భిణులైన గాంధీనగర్‌ గ్రామానికి చెందిన చిర్రబోయిన రాధిక, గవిచర్ల గ్రామానికి చెందిన కెనసాలపు మమత శుక్రవారం సాయంత్రం పీహెచ్‌సీలో చేరారు.

వీరిలో మమత రాత్రి 12.05కు, రాత్రి 2.15 గంటలకు రాధిక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తెల్లవారుజామున తీగరాజుపల్లికి చెందిన అజ్మీరా కవిత మొదటి కాన్పు కోసం రాగా ఉదయం 8.05కు మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యాధికారి డాక్టర్‌ శంకేసి శిరీష్‌కుమార్, స్టాఫ్‌ నర్సులు సునిత, అనిల్‌ చికిత్స చేయగా.. వైద్యాధికారి డాక్టర్‌ సుధీర్‌బాబు అభినందించారు. ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు సంగెం పీహెచ్‌సీలో 37 ప్రసవాలు జరిగాయని వైద్యాధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement