♦ రాజధానిలో యూపీ, బీహార్ ముఠాలు
♦ శివారు కాలనీలే లక్ష్యంగా దొంగతనాలు
♦ పక్కాగా రెక్కీ... చాకచక్యంగా తాళాలు ధ్వంసం
♦ అడ్డొస్తే విచక్షణారహితంగా ఎదురు దాడే..!
♦ వరుస దొంగతనాలతో ఆందోళనలో ప్రజలు
♦ నిద్దరోతున్న రాత్రి గస్తీ
సాక్షి, అమరావతిబ్యూరో :
రాజధానిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. శివారు ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. యూపీ, బీహార్లకు చెందిన దొంగల ముఠాలు అమరావతిపై ఏడాది కిందటే కన్నేశాయి. కృష్ణా పుష్కరాల సమయంలోనే ఈ ముఠాలు ఇక్కడికి వచ్చాయి. ఇళ్లలో దొంగతనాలతో సరిపెట్టుకోలేదు. జనసమూహం ఉండే ప్రదేశాల్లో బంగారు ఆభరణాలు, లగేజీ బ్యాగుల అపహరణతో హడలెత్తించారు. అప్పట్లో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు. కొద్దికాలం వెనక్కి తగ్గిన ఆ ముఠాలు మళ్లీ రెండు నెలలుగా రాజధాని ప్రాంతంలో తమ తడాఖా చూపిస్తున్నాయి.
వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉండటం వల్లే...
తాజా పరిణామాలతో అంతర్రాష్ట్ర దొంగల వ్యవహారాలపై విజయవాడ పోలీసులు కూపీ లాగుతున్నారు. తిరుపతి, నెల్లూరులతోపాటు హైదరాబాద్ పోలీసులతో కూడా సంప్రదిస్తూ అక్కడ జరుగుతున్న దొంగతనాల తీరుతో పోల్చి చూస్తున్నారు. హైదరాబాద్ పోలీసులతో సంప్రదించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాలకు అమరావతిలో సంఘటనలకు మధ్య సారూప్యత ఉందని గుర్తించారు.
యూపీ, బీహార్లకు చెందిన దొంగలు తెలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలపైనే కన్నేశారని నిర్ధారించారు. దాదాపు 300 దొంగల కుటుంబాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను లక్ష్యంగా చేసుకున్నాయని గుర్తించారు. ఇక్కడ నిర్మాణ కార్యకలాపాలు, ఇతర వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండటమే ఇందుకు కారణమని తేలింది. దీంతోపాటు ఈ నగరాలను ఆనుకుని గ్రామీణ ప్రాంతాలు ఉండటం కూడా తమకు కలసివస్తుందని దొంగల ముఠాలు భావించాయి.
దశలవారీగా వస్తూ...
యూపీ, బీహార్ల నుంచి దొంగల ముఠాలు దశలవారీగా వచ్చి కొన్ని నెలలపాటు రాజధాని పరిధిలో ఉండి దొంగతనాలతో హల్చల్ చేయాలని నిర్ణయించుకున్నాయి. నిఘా తక్కువగా ఉండే శివారు కాలనీల్లో ఒకటికి రెండుసార్లు రెక్కీ నిర్వహించి పకడ్బందీగా దొంగతనాలను పాల్పడుతున్నాయి ఈ క్రమంలో కొందరు పోలీసులకు చిక్కినప్పటికీ ఇతర ముఠాలు వెనక్కి తగ్గకూడదని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే విచక్షణారహితంగా దాడి చేయడానికి కూడా ఈ ముఠాలు సిద్ధపడి ఉంటాయని పోలీసుల విచారణలో వెల్లడికావడం కలవరపరుస్తోంది.
నిద్రమత్తులో నిఘా..
రాజధాని అమరావతి ప్రాంతంలో రాత్రిళ్లు భద్రత లోపభూయిష్టంగా ఉండటం దొంగలకు కలసివస్తోంది. విజయవాడలోగానీ శివారు కాలనీల్లో రాత్రి గస్తీ లేకుండాపోయింది. తగినంత మంది సిబ్బంది, వాహనాలు వంటి మౌలిక వ్యవస్థ లేకపోవడం వల్లే రాత్రి గస్తీ బలహీనపడిందని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాల కోసం ఏడాదిన్నరగా అడుతున్నా... ఇప్పటికీ కూడా నిధులు మంజూరు చేయలేదని ఆయన చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో యూపీ, బీహార్ ముఠాలు రాజధానిలో తిష్టవేశాయన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పోలీసులు నిఘాను ముమ్మరం చేసి దొంగల ఆగడాలను ఆరికట్టాల్సిన అవసరం ఉంది.
దొంగలొచ్చారు.. దోచుకెళ్తారు!
Published Fri, Jul 7 2017 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement