ప్రజల అభీష్టం మేరకే జిల్లాల విభజన | The will of the people Contribution District Division | Sakshi
Sakshi News home page

ప్రజల అభీష్టం మేరకే జిల్లాల విభజన

Sep 2 2016 2:53 AM | Updated on Jul 29 2019 2:51 PM

ప్రజల అభీష్టం మేరకే జిల్లాల విభజన - Sakshi

ప్రజల అభీష్టం మేరకే జిల్లాల విభజన

జిల్లాల, మండలాల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకే జరగాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.

రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం
సంస్థాన్ నారాయణపురం/మంచాల: జిల్లాల, మండలాల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకే జరగాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా రాచకొండ అటవీ ప్రాంతంలో గిరిజనుల భూమిగోస అధ్యయన యాత్రలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు పునర్విభజన చేయూలన్నారు. రాచకొండలో గిరిజన రైతులు నాలుగు తరాలుగా ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ న్యాయపరంగా పట్టా హ క్కులు పొంది గతంలో రుణాలు కూడా పొందారని, కానీ ప్రస్తుతం ఆ రైతులకు ఆన్‌లైన్ పహాణీలు ఇవ్వడం లేదని తెలిపారు.

దీంతో రుణాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పారు. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం.. వాటిని లాక్కోవడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement