సంగారెడ్డి జోన్/రూరల్: సదాశివపేట పట్టణ పరిధిలో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి పొజిషన్ చూపించాలంటూ చేపట్టిన ‘కలెక్టరేట్ ముట్టడి’ ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాలు గు రోజులుగా సదాశివపేట కేంద్రంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన జగ్గారెడ్డి మంగళవారం కలెక్టరేట్ ముట్ట డికి పిలుపునిచ్చారు. పట్టణంలోని రామ మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అనుచరులతో సిద్ధమయ్యారు. రామ మందిరం వద్దే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంద్రకరణ్ పోలీస్స్టేషన్కు తరలిం చారు.
తీవ్ర ఉద్రిక్తం..
జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో అతని అనుచరులు వాహనానికి అడ్డుపడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి, జహీరాబాద్ డీఎస్పీలు తిరుపతన్న, నల్లమల్ల రవి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
స్థలాలు ఇచ్చే వరకు పోరాటం..
నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20 వరకు పేదలకు పట్టాలు అందజేసిన 5,500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు త్చమ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్లస్థలాలు ఇప్పించే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోపాజి అనంతకిషన్, సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పండరీనాథ్గౌడ్, నాయకులు వెంకట్రెడ్డి, సర్పంచ్లు బుచ్చిరాములు, దశరథ్, మల్కయ్య పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
Published Wed, Jul 5 2017 8:01 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement