కుప్పం టీడీపీ వార్డు మెంబర్లు రాజీనామా చేశారు.
కుప్పం: తమ గ్రామంలో మూడేళ్లుగా అభివృద్ధి జరగడం లేదంటూ కుప్పం మేజర్ పంచాయతీ వార్డు సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. మొత్తం 20 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వార్డు సభ్యులు పంచాయతీలో ఉన్నారు. వీరిలో 16మంది ప్రజల అవసరాలు తీర్చని పదవులు తమకు వద్దంటూ నిరసనలను తెలిపారు.
ఈ మేరకు రాజీనామా పత్రాలను అందజేసినా.. ఎంపీడీవో తీసుకోవడం లేదని మండల కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వరదరాజు అనే వార్డు సభ్యుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. మిగిలిన సభ్యులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.