టీడీపీ మహానాడు వేదిక ఖరారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదిక ఖరారైంది. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో మహానాడు జరగనుంది. ఈ మేరకు వేదికను ఖరారు చేసినట్లు పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి, ఎమ్మెల్సీ టీడీ జనార్ధనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకూ మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. తిరుపతిలో మహానాడు నిర్వహించాలని ఈనెల 2 న జరిగిన పార్టీ సమన్వయ కమిటీ, మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయించిన విషయం తెలిసిందే.