పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో తొమ్మిదో తరగతి చదివే గణేశ్(14) అనే విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో తొమ్మిదో తరగతి చదివే గణేశ్(14) అనే విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. లక్ష్ముంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని తనువు చాలించాడన్నారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న గణేశ్ పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా నయం కాకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. విషయం తెలిసిన వెంటనే ఎంఈఓ రాముడు గ్రామానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.