యూనివర్సిటీ విద్యార్థులు లేకుండా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తారా అంటూ ఎస్కేయూ విద్యార్థి జేఏసీ సోమవారం విలేకరుల సమావేశంలో విమర్శించింది.
ఎస్కేయూ : యూనివర్సిటీ విద్యార్థులు లేకుండా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తారా అంటూ ఎస్కేయూ విద్యార్థి జేఏసీ సోమవారం విలేకరుల సమావేశంలో విమర్శించింది. జాతీయ జెండా ఆవిష్కరణ సమయం మార్పు అంశం విద్యార్థులకు తెలియజేయడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడింది. దీంతో కేవలం క్యాంపస్ స్కూలు విద్యార్థులు మాత్రమే కార్యక్రమాలకు హాజరయ్యారని పేర్కొంది.
విలేకరుల సమావేశంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. లింగారెడ్డి, గెలివి నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, జయచంద్ర, మోహన్రెడ్డి, భానుప్రకాష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేశులు, సుబ్బరాయుడు, వేమన్న, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, రమణ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, అక్కులప్ప పాల్గొన్నారు.