పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ - 2017 శుక్రవారం సజావుగా ముగిసింది.
ఎస్కేయూ : పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ - 2017 శుక్రవారం సజావుగా ముగిసింది. ఎంఎల్ఐఎస్సీ, పొలిటికల్ సైన్సెస్ ప్రవేశరాత పరీక్షలను ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్బాబు పరిశీలించారు పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించిన ఎస్కేయూ సెట్ నిర్వాహకులను రెక్టార్, రిజిస్ట్రార్ అభినందించారు. ఇదిలా ఉండగా అడల్ట్ ఎడ్యుకేషన్కు 56, హిందీకి 32, ఎంఎల్ఐఎస్సీకి 190, పొలిటికల్ సైన్సెస్కు 407 మంది అభ్యర్థులు హాజరయ్యారు.