తిరుమలలో ఆరడుగుల నాగుపాము | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఆరడుగుల నాగుపాము

Published Tue, Jun 28 2016 6:10 PM

తిరుమలలో ఆరడుగుల నాగుపాము - Sakshi

తిరుమలలో వన్యప్రాణుల బెడత పెరిగింది. ఒకవైపు చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన పడుతోంటే.. మరో వైపు.. నాగు పాములు, కొండ చిలువలు.. జనావాసాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం ఆరు అడుగుల నాగుపాము అటవీశివారు ప్రాంతం నుండి బాలాజీనగర్ చివరి సంధు వద్ద రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు పామును చూసి పరుగులు తీసారు. సమాచారం అందుకున్న  టీటీడీ ఫారెస్ట్ మజ్దూర్ భాస్కర్‌నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి పామును పట్టుకున్నాడు. దీంతో జనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత నాగుపామును అటవీ ప్రాంతంలో వదిలి వేశారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement