దేవుడా.. పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించు ! | sarwa matha prarthanalu | Sakshi
Sakshi News home page

దేవుడా.. పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించు !

Oct 16 2016 10:22 PM | Updated on Mar 18 2019 9:02 PM

దేవుడా.. పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించు ! - Sakshi

దేవుడా.. పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించు !

భగవంతుడా.. ప్రజలకు మంచి పాలన అందించేలా అధికారులు, పాలకులకు సద్బుద్ధిని ప్రసాదించు.. అని కోరుతూ కాంగ్రెస్‌ నగర కమిటీ ఆధ్వర్యాన సర్వమత ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆధ్వర్యాన సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ఫ్లాంట్‌ వద్ద ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్‌) : భగవంతుడా.. ప్రజలకు మంచి పాలన అందించేలా అధికారులు, పాలకులకు సద్బుద్ధిని ప్రసాదించు.. అని కోరుతూ కాంగ్రెస్‌ నగర కమిటీ ఆధ్వర్యాన సర్వమత ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆధ్వర్యాన సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ఫ్లాంట్‌ వద్ద ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ హామీలను మరచిపోవడం.. ప్రజల బాధలను పట్టించుకోకపోవడం.. వంటి దుర్మార్గమైన చర్యలతోపాటు అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సింగ్‌నగర్‌లో చెత్త సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లయినా దానిని నెరవేర్చలేదన్నారు. ఇప్పటికీ ఎక్సెల్‌ ఫ్లాంట్‌లోనే చెత్త డంప్‌ చేయిస్తున్నారన్నారు. పాలకులకు ఇటువంటి మోసపూరిత బుద్ధిని తొలగించి ప్రజలకు మంచి పాలన అందించేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బత్తుల దుర్గారావు, మీసాల సత్యనారాయణ, రేపల్లి కిరణ్, దుర్గారావు, మస్తాన్‌వలి, జయకర్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement