దుబ్బాక ప్రెస్క్లబ్ నిర్మాణానికి రూ.25లక్షలను మంజూరు చేయించినట్లు ప్రకటించారు.
దుబ్బాక రూరల్: దుబ్బాకలో నూతనంగా చేపట్టనున్న ప్రెస్క్లబ్ నిర్మాణానికి రూ.25లక్షలను మంజూరు చేయించినట్లు ప్రకటించారు. దుబ్బాక ప్రెస్క్లబ్ నిర్మాణానికి నిధులు ప్రకటించిన ఎమెల్యే రామలింగారెడ్డికి దుబ్బాక ప్రెస్క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు, సీనియర్ జర్నలిస్టులు ఇంగు శివకుమార్, అంబటి వెంకట్గౌడ్, వీరబత్తిని శ్రీనివాస్, కాల్వ లింగం, గన్నె తిరుపతిరెడ్డి, బండ నర్సింలు, పల్లె వెంకటస్వామిగౌడ్, ఇస్తారిగల్ల ఎల్లం, వేములవాడ నవీన్ కుమార్, ఎండి చౌకత్, సుభాష్రెడ్డి, జైపాల్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జర్నలిస్టుల డే సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.