తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 5 కాసుల బంగారం, కిలో వెండిని ఎత్తుకుపోయిన ఘటన ఆదివారం అర్ధరాత్రి ఇంద్రపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం డ్రైవర్స్కాలనీకి చెందిన వులిశెట్టి భాను కుటుంబ సభ్యులు వేసవి
-
5 కాసుల బంగారం, కిలో వెండి అపహరణ
ఇంద్రపాలెం (కాకినాడ రూరల్) :
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 5 కాసుల బంగారం, కిలో వెండిని ఎత్తుకుపోయిన ఘటన ఆదివారం అర్ధరాత్రి ఇంద్రపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం డ్రైవర్స్కాలనీకి చెందిన వులిశెట్టి భాను కుటుంబ సభ్యులు వేసవి సెలవులు కావడంతో బంధువుల ఇళ్లకు వెళ్లారు. శనివారం ఉదయం భాను ఉంటున్న జీప్లస్ టూ పై అంతస్తులోని పోర్ష¯ŒSకి తాళం వేసుకుని శనివారం రాత్రి వ్యక్తిగత పనిపై పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలో ఉన్న సుమారు ఐదు కాసుల బంగారు ఆభరణాలు, కిలో వెండి, సుమారు రూ. 5 వేల నగదును దోచుకుపోయారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కింద పోర్ష¯ŒSలో ఉంటున్న నివాసితులు భానుకి ఫో¯ŒS చేశారు. ఇంటి తాళం కప్ప బద్దలు కొట్టబడి ఉందని, ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా ఉన్నాయని సమాచారం ఇచ్చారు. తణుకులో ఉన్న భాను హుటాహుటిన ఇంటికి చేరుకుని దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి ఎస్సై డి.రామారావుకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఆయన క్లూస్ టీమ్ని రప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.