రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం | Revanth Reddy Fire on CM KCR | Sakshi
Sakshi News home page

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం

Oct 28 2016 2:01 AM | Updated on Aug 14 2018 10:54 AM

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం - Sakshi

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం

రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మహబూబ్‌నగర్ నుంచే శాసిస్తామని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు.

 ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కేసీఆర్‌ను దించుతాం: రేవంత్
 జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మహబూబ్‌నగర్ నుంచే శాసిస్తామని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ఆ పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పాలమూరు జిల్లానుంచి వేరుచేయలేరని, ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తామన్నారు. ఎంపీగా కేసీఆర్ గెలిచిన పాలమూరు నుంచి ముఖ్యమంత్రి కుర్చీ నుంచి ఆయనను దించుతామన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వద్దకు మంత్రి హరీశ్  వెళ్లి ఫొటో దిగి తామే కట్టామని చెప్పిపోయాడని  పరుష వ్యాఖ్యలు చేశారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లులేవు కానీ, సీఎం మాత్రం రూ.150 కోట్లతో 10 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement