జాస్మిన్ అనే యువతి మృతితో రెండు రోజులుగా ఉద్రిక్తంగా ఉన్న రేపల్లె పట్టణం మంగళవారం ప్రశాంతంగా ఉంది.
జాస్మిన్ అనే యువతి మృతితో రెండు రోజులుగా ఉద్రిక్తంగా ఉన్న రేపల్లె పట్టణం మంగళవారం ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా, రేపల్లెతోపాటు జాస్మిన్ స్వగ్రామం నిజాంపట్నం మండలం అడవుల దీవి గ్రామంలో పోలీసులు విధించిన 144వ సెక్షన్ కొనసాగుతోంది. జాస్మిన్తో పాటు మృతి చెందిన శ్రీసాయి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం స్వగ్రామం గరువులో నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.