'రెడ్డికాలువ పనులను త్వరగా పూర్తి చేయాలి' | reddy canal works complete immediately says YSRCP MLA | Sakshi
Sakshi News home page

'రెడ్డికాలువ పనులను త్వరగా పూర్తి చేయాలి'

Nov 12 2015 1:56 PM | Updated on Mar 19 2019 7:00 PM

వైఎస్సార్సీపీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గురువారం ఓబులవారిపల్లి మండలంలో పర్యటించారు.

వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గురువారం ఓబులవారిపల్లి మండలంలో పర్యటించారు. అకాల వర్షాలకు రెడ్డికాలువకు గండి పడింది. దీంతో భారీగా నీరు వృథాగా పోతుంది.

రెడ్డి కాలువను సందర్శించిన అనంతరం గండి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆదేశించారు.  ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మనందరెడ్డి, ఇరిగేషన్ డీఈ మురళీ పర్యటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement