రాయపట్నంలో ముమ్మరంగా రహదారి పనులు
ధర్మపురి : రాయపట్నం పాత వంతెన ప్రమాదస్థాయికి చేరడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో సంబంధిత అధికారులు పనులు త్వరగా పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. మండంలోని రాయపట్నం గోదావరిపై 1955లో లోలెవల్ వంతెన నిర్మించారు. వంతెన ఎత్తు తక్కువగా ఉండడంతో తరచు మునుగుతుంది.
ధర్మపురి : రాయపట్నం పాత వంతెన ప్రమాదస్థాయికి చేరడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో సంబంధిత అధికారులు పనులు త్వరగా పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. మండంలోని రాయపట్నం గోదావరిపై 1955లో లోలెవల్ వంతెన నిర్మించారు. వంతెన ఎత్తు తక్కువగా ఉండడంతో తరచు మునుగుతుంది. 2011లో కొత్త వంతెన పనులు చేపట్టగా..చివరిదశకు వచ్చాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పాత వంతెన ప్రమాదస్థాయికి చేరడంతో బస్సులు, భారీ వాహనాలను నిలిపివేశారు. పాత వంతెనపై రాకపోకలు లేనందున కొత్త బ్రిడ్జి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. వంతెనపై థార్రోడ్డు పనులు పూర్తికాగ అక్కడి నుండి కంకర పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.