రేషన్ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

రేషన్ బియ్యం పట్టివేత

Published Mon, May 9 2016 5:51 PM

ration rice captured in ysr kadapa district

చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం కుందూ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 24 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎంఆర్ఓ జ్ఞానమూర్తి సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీరాములు అనే వ్యక్తి 24 బస్తాల రేషన్ బియ్యాన్ని బద్వేలుకు ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను పోలీసు స్టేషన్‌కు తరలించి శ్రీరాములుపై కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement