ప్రాణహిత-చేవెళ్ల కోసం పోరాడుదాం | ranga reddy district ysrcp leaders decided to fight for pranahita chevella project | Sakshi
Sakshi News home page

ప్రాణహిత-చేవెళ్ల కోసం పోరాడుదాం

May 15 2016 10:12 PM | Updated on May 29 2018 2:26 PM

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతోనే రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.

► వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో నేతలు
రంగారెడ్డి జిల్లా:
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతోనే రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జిల్లాలో కొంత ప్రాంతానికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లా అంతటా సాగునీరు అందించవచ్చని పేర్కొంది. ఈ ప్రాజెక్టు సాధనకోసం ఉద్యమించాలని నిర్ణయించుకుంది. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలను పరిచయం చేసుకున్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే జిల్లా నూతన అధ్యక్షులను ఎంపిక చేస్తామని, అదేవిధంగా అనుబంధ కమిటీలకు కార్యవర్గాల్ని నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందని, ఈ ప్రాజెక్టుతో పది జిల్లాలు మాత్రమే నీరందే అవకాశముందన్నారు.

జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరు, తాగునీరు అందాలంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టే పరిష్కారమాన్నారు. ఈ ప్రాజెక్టును సాధించేందుకు ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్లు అమృతాసాగర్, చెరుకు శ్రీనివాస్, సత్యమూర్తి, చంద్రశేఖర్, బల్వంత్‌రెడ్డి, జొన్నాడ రాజయ్య, జంగయ్యగౌడ్, సంగమేశ్వర్, నాగరాజు, మురళీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య, కుసుమకుమార్ రెడ్డి, జయ, అశోక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement