రానున్న నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు నాలుగు రోజుల్లో అక్కడక్కడ 2 నుంచి 7 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు.
పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41, రాత్రిళ్లు 25 నుంచి 26 డిగ్రీల మేర ఉండొచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 69, మధ్యాహ్నం 33 నుంచి 35 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. గంటకు 12 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.