విపత్తుల నివారణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సూచించారు.
విపత్తుల నివారణకు ప్రణాళిక
Feb 14 2017 12:40 AM | Updated on Sep 5 2017 3:37 AM
–జేసీ హరికిరణ్
కర్నూలు(అగ్రికల్చర్): విపత్తుల నివారణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సూచించారు. అహ్మదాబాద్కు చెందిన ఆలిండియా డిజాస్టర్ మిటిగేషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రతి శాఖ వద్ద తగిన ప్రణాళిక ఉండాలన్నారు. జిల్లాలో గత 30 ఏళ్లలో సంభవించిన విపత్తులు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలలపై ఈ నెల 28లోగా నివేదికలు ఇవ్వాలన్నారు. విపత్తులు ఊహించని విధంగా వస్తాయని.. సమగ్రంగా ప్రణాళికలు లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంటు కో- ఆర్డినేటర్ ఆనంద్.. పవర్పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, సీపీఓ ఆనంద్నాయక్, విద్యుత్ ఎస్ఈ బార్గవరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement