రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | one dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Aug 15 2017 10:58 PM | Updated on Aug 30 2018 4:10 PM

మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చౌళూరు గ్రామ సమీపంలోని మంగళవారం జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.

హిందూపురం రూరల్‌: మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చౌళూరు గ్రామ సమీపంలోని మంగళవారం జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. రూరల్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరు రూరల్‌ తాలూకాలోని నడువలహళ్లి చెందిన నరసిహమూర్తి(28), కుందేనహళ్లికి చెందిన రాజు (35) చౌళూరుకు ద్విచక్రవాహనంలో వచ్చారు. 

తిరుగు ప్రయాణంలో చౌళూరు గ్రామ సమీపంలో చెరువు కట్ట మీద ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ద్విచక్రవానం ఢీ కొంది ప్రమాదంలో నరసింహప్పకు తలకు తీవ్రంగా గాయాలు కాగా రాజుకి స్వల్పగాయాలయ్యయి. గ్రామస్తులు వారిని 108 సహాయంతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నరసింహప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement