పాములపాడు: వడదెబ్బతతో పాములపాడుకు చెందిన బాలనాగశేషులు(24) బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం ఇతను ఉపాధి పనులకు వెళ్లాడు. ఎండ వేడిమి తట్టుకోలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. సాయంత్రం పెట్రోల్ బంకులో విధుల నిమిత్తం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధాకరరెడ్డి కేసు నమోదు చేశారు. లావణ్య నిండు గర్భిణి కాగా.. మృతుని తల్లి లింగమ్మ చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయింది.
Related news
-
కొనసాగుతున్న వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా పలుచోట్ల 43–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 174 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రాజాం (విజయనగరం)లో 45.5, కొండయ్యగూడెం (అల్లూరి జిల్లా)లో 45.1, కాజీపేట (వైఎస్సార్)లో 44.7, కోడుమూరు (కర్నూలు)లో 44.2, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, నందరాడ (తూర్పు గోదావరి), రావిపాడు (పల్నాడు), కొల్లివలస (శ్రీకాకుళం)లలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల 43–44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం బలహీన పడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా తమిళనాడు ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకట్రెండుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
45 డిగ్రీలు దాటేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చండ ప్రచండ వేడితో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజిపూర్లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అదే విధంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్, ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతా యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వచ్చే నెల మేలో పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా... రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్లో 24.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. -
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
ఒకేరోజు 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఛత్తీస్గఢ్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు తగ్గింది. తేమ 87 శాతానికి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలోని ఇళ్లు, కార్యాలయాల్లోని ఏసీలు, కూలర్లకు విశ్రాంతి దొరికింది. రాజధాని రాయ్పూర్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. గడచిన 24 గంటల్లో రాయ్పూర్లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, రాయ్పూర్లో 24.7, మనాలో 24, బిలాస్పూర్లో 28.4, పెండ్రారోడ్లో 29.6, అంబికాపూర్లో 31.5, జగదల్పూర్లో 26.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయ్పూర్లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది. -
వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఇలా.. ఏప్రిల్ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్లో) 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్లో ఎల్నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.
Related News by category
-
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
నేడు తర్తూరు రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: త ర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓఏడీ వెంకటరమణ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంతో అలంకరించిన ప్రభోత్సవ రథంపై కొలువుంచారు. అనంతరం గ్రామోత్సవంలో ప్రజలు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
ఓటు తప్పకుండా వేస్తా
నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. దరఖాస్తును ఆమోదించి ఓటరుగా నమోదు చేశారు. స్మార్ట్ ఎపిక్ కార్డు కూడా వచ్చింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఓటు లభించింది. పోలింగ్ రోజు ఎన్ని పనులున్నా.. ఓటు తప్పకుండా వేస్తాను. స్వేచ్ఛగా, నిర్ఛయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాను. – పి.లక్ష్మిచేతన రెడ్డి, వీనస్ కాలనీ, కర్నూలు ● -
స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా
ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతోనే అమోదించి ఓటరుగా నమోదు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నా ఓటు నేను స్వేచ్ఛగా వినియోగించుకుంటాను. పాలకులు మంచివారైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటువేస్తాను. మొదటి సారిగా ఓటు వేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఓటు వేస్తా... నా స్నేహితులతో కూడా ఓటు వేయిస్తాను. – గుర్రం చేతన లాస్య, చాణుక్యపురి కాలనీ, కర్నూలు -
మంచి పాలనకే ‘తొలి’ ఓటు!
● నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం ● ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగం ● పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది ● తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత మనోగతం కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలన అందించే వారికే తాము ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు చెబుతున్నారు. పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి వారినే తాము ఎన్నుకుంటామని పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో 20.14 లక్షలు, నంద్యాల జిల్లాలో 13.94 లక్షలు.. మొత్తం 34.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్ల యువత 1,71,215 మంది ఉన్నారు. అయితే ఇందులో 87,285 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మే నెల 13న నిర్వహించే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 49,741, నంద్యాల జిల్లాలో 37,844 మంది మొద టి సారిగా ఓటు వేయనున్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని, అభివృద్ధి చేసేవారని గెలిపిస్తామని చెబుతున్నారు. ఈ సారి పెరగనున్న ఓటింగ్ శాతం.. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఎన్నికల కమిషన్ పిలుపు నిస్తోంది. ఇందులో భాగంగా స్వీప్ కార్యక్రమాలను అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2019 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్కు 50 శాతం వరకు యువత దూరంగా ఉంటోంది. ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా యువఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజక వర్గం 18–19 ఏళ్ల యువ ఓటర్లు కర్నూలు 6,425 పాణ్యం 8,250 పత్తికొండ 5,678 కోడుమూరు 5,947 ఎమ్మిగనూరు 6,483 మంత్రాలయం 5,429 ఆలూరు 5,749 శ్రీశైలం 8,349 నంద్యాల 6,709 బనగానపల్లె 6,402 ఆదోని 5,510 ఆళ్లగడ్డ 5,247 డోన్ 5,488 నందికొట్కూరు 5,609 మొత్తం 87,275
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement