నేడు మేడారంలో మంత్రుల పర్యటన | ministers visit medaram Today, | Sakshi
Sakshi News home page

నేడు మేడారంలో మంత్రుల పర్యటన

Feb 3 2016 8:46 AM | Updated on Sep 3 2017 4:53 PM

ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారక్క జాతర ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా.. ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారించింది. తెలంగాణ వచ్చాక జరుగుతున్న తొలి జాతర కావడంతో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement