డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి | man dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి

Aug 6 2017 10:38 PM | Updated on Apr 3 2019 8:07 PM

అప్పిలేపల్లికి చెందిన రుద్రముని (44) ఆదివారం డెంగీ లక్షణాలతో మృతిచెందినట్లు భార్య లీలావతి తెలిపారు.

కుందుర్పి: అప్పిలేపల్లికి చెందిన రుద్రముని (44) ఆదివారం డెంగీ లక్షణాలతో మృతిచెందినట్లు భార్య లీలావతి తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రుద్రమునికి కళ్యాణదుర్గం, అనంతపురం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. డెంగీ లక్షణాలతోనే ప్రాణాలు కోల్పోయినట్లు భార్య లీలావతి రోదించింది. ఇదిలా ఉండగా.. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండి, దోమలు పెరిగిపోవడంతో జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు తెలిపారు. రుద్రముని మృతిచెందిన తర్వాత వైద్యసిబ్బంది అప్రమత్తమై గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement