మహిషాసురమర్దిని సైకత శిల్పం | mahishasuramardini Sand sculpture | Sakshi
Sakshi News home page

మహిషాసురమర్దిని సైకత శిల్పం

Oct 9 2016 8:56 PM | Updated on Aug 28 2018 8:41 PM

మహిషాసురమర్దిని సైకత శిల్పం - Sakshi

మహిషాసురమర్దిని సైకత శిల్పం

దుర్గాష్టమిని పురస్కరించుకుని కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన సైకతశిల్పి ఆకునూరి బాలాజీవరప్రసాద్‌ ఆదివారం బందరు మండలం మంగినపూడి బీచ్‌ ఒడ్డున శ్రీమహిషాసురమర్దిని సైకితశిల్పాన్ని రూపొందించారు.

మచిలీపట్నం (కోనేరు సెంటర్‌) : దుర్గాష్టమిని పురస్కరించుకుని కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన సైకతశిల్పి ఆకునూరి బాలాజీవరప్రసాద్‌ ఆదివారం బందరు మండలం మంగినపూడి బీచ్‌ ఒడ్డున శ్రీమహిషాసురమర్దిని సైకితశిల్పాన్ని రూపొందించారు. 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున ఈ శిల్పాన్ని ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ విజయవాడ ఆధ్వర్యంలో తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిచూపుతున్నారు. బాలాజీ గతంలో వినాయచవితిని పురస్కరించుకుని శైవlగణనాథుడి సైకత శిల్పాన్ని రూపొందించి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల మన్ననలు అందుకున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement