విశాఖ జిల్లా పెదగంట్యాడలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)కు 21.68 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది.
‘వుడా’కు 21.68 ఎకరాలు
Aug 30 2016 9:45 PM | Updated on Sep 4 2017 11:35 AM
సాక్షి, హైదరాబాద్: విశాఖ జిల్లా పెదగంట్యాడలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)కు 21.68 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ భూమి ఎకరం విలువ రూ.60 లక్షలుగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే నగరాభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని వుడాకు ఉచితంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ మంగళవారం జీవో జారీ చేశారు.
Advertisement
Advertisement