కర్నూలు రీజియన్ కేంద్రంగా పనిచేస్తున్న రాయలసీమ జిల్లాల అధికారి పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ పశ్చిమబెంగాల్కు బదిలీ కానున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
కర్నూలు రీజియన్ పీఎంజీ బదిలీ?
Mar 26 2017 11:41 PM | Updated on Sep 18 2018 8:18 PM
కర్నూలు (ఓల్డ్సిటీ): కర్నూలు రీజియన్ కేంద్రంగా పనిచేస్తున్న రాయలసీమ జిల్లాల అధికారి పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ పశ్చిమబెంగాల్కు బదిలీ కానున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మార్చి నెలాఖరు వరకే ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. పీఎంజీ లేని సమయంలో రీజియన్ పరిధిలోని నాలుగు జిల్లాల తపాలా శాఖ నిర్వహణ బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ పి.సంతాన రామన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పీఎంజీ మాట్లాడుతూ తనకు ఈ కార్యక్రమమే చివరిదంటూ ఆయన ప్రకటించి బదిలీ సంకేతాలు ఇచ్చారు.
Advertisement
Advertisement