సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. వరంగల్ సీపీగా శ్వేత, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా సింధుశర్మ, సీఐడీ ఎస్పీగా చెన్నూరి రూపేష్,వికారాబాద్ అడ్మీన్ ఎస్పీగా రాజేష్ మీరా నియామకమయ్యారు. సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సీపీగా సన్ప్రీత్ సింగ్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వై.సాయిశేఖర్, సీఐడీ ఎస్పీలుగా చెన్నూరి రూపేష్, ప్రవీణ్ కుమార్, వికారాబాద్ అడ్మీన్ ఎస్పీగా రాజేష్ మీరా బదిలీ అయ్యారు.
గోల్కోండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా చంద్రమోహన్,ఇంటలిజెన్స్ ఎస్పీగా రామ్ రెడ్డి , హైడ్రా అడిషనల్ కమిషనర్గా ఆనంద్ కుమార్,ఇంటలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్దిఖీ మెుత్తంగా 26 మంది అధికారుల బదిలీ జరిగింది.


