breaking news
pgm
-
కర్నూలు రీజియన్ పీఎంజీ బదిలీ?
కర్నూలు (ఓల్డ్సిటీ): కర్నూలు రీజియన్ కేంద్రంగా పనిచేస్తున్న రాయలసీమ జిల్లాల అధికారి పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ పశ్చిమబెంగాల్కు బదిలీ కానున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మార్చి నెలాఖరు వరకే ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. పీఎంజీ లేని సమయంలో రీజియన్ పరిధిలోని నాలుగు జిల్లాల తపాలా శాఖ నిర్వహణ బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ పి.సంతాన రామన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పీఎంజీ మాట్లాడుతూ తనకు ఈ కార్యక్రమమే చివరిదంటూ ఆయన ప్రకటించి బదిలీ సంకేతాలు ఇచ్చారు. -
మరింత మెరుగైన సేవలు
– కర్నూలులో ఎన్జీఎన్, పేరూటర్ ప్రారంభించిన సీజీఎం – విభజన తర్వాత మొదటిసారి వచ్చిన సీజీఎంకు ఘనసత్కారం కర్నూలు (ఓల్డ్సిటీ): రాష్ట్రంలో మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీజీఎం దామోదరరావు తెలిపారు. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) వి.సుందర్తో కలిసి సోమవారం స్థానిక ఈ10బీ ఎక్స్ఛేంజీలో నెక్ట్స్ జనరేషన్ నెట్వర్క్ (ఎన్జీఎన్), పేరూటర్ను ప్రారంభించారు. ఏపీ సర్కిల్ విభజన తర్వాత మొదటిసారిగా కర్నూలుకు వచ్చిన ఈ ఇద్దరు రాష్ట్ర ఉన్నతాధికారులను స్థానిక ఉద్యోగులు, అధికారులు, యూనియన్ల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీఎన్తో కర్నూలు ప్రజలకు నాణ్యమైన సేవలతో పాటు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజల సౌకర్యార్థం ఇటీవల 49కే ల్యాండ్ లైన్, 249కే బ్రాడ్బ్యాండ్ పథకాలు అమలు చేస్తున్నామని, జిల్లా ప్రజలు వినియోగించుకోవాలన్నారు. త్వరలో ఎక్సేంజ్ పరికరాలు ప్రజల వద్దకే తీసుకెళ్లే విధానం కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆరునెలల కాలంలో 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. వైఫై సేవలకు ప్రస్తుతం ఐదు చోట్ల అనుమతించామని, టవర్ల కంటే వైఫై విధానమే మేలని తెలిపారు.