కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు సిద్ధమవుతోంది. గత నెలలో కోనసీమలో తలపెట్టిన పాదయాత్రను చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపి నిలిపివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో డిమాండ్లను
-
నేడు కంచాలపై గరిటెలతో ఆకలి కేకలు
-
ముఖ్య కూడళ్లలో నిరసనలకు ఏర్పాట్లు
-
తాడేపల్లిగూడెంలో ’ముద్రగడ’
-
జిల్లాలోనే ఇతర నేతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు సిద్ధమవుతోంది. గత నెలలో కోనసీమలో తలపెట్టిన పాదయాత్రను చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపి నిలిపివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో డిమాండ్లను సాధించుకునే దిశగా గత నెలలో కాకినాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించింది.అందులో దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. తొలి విడతగా ఈ నెల 18 (ఆదివారం)న కంచాలు, పల్లాలపై గరిటెలతో శబ్థాలు చేస్తూ ఆకలికేకలు పేరుతో ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు ప్రతి నియోజకవర్గంలో 30 మంది కాపు వర్గీయులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లులో ఆ కమిటీ ఆధ్వర్యంలో కాపు వర్గీయులు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక వెసలుబాటును బట్టి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు ఇందులో ప్రధానంగా మహిళలు, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేసేలా జేఏసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగే కాపుల ఆకలికేకలు కార్యక్రమ ంలో పాల్గొననున్నారు. జిల్లా కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ రావులపాలెం, వాసిరెడ్డి ఏసుదాసు కాకినాడ భానుగుడి జంక్షన్, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒS తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గడియారపు స్తంభం సెంటర్లో ఆకలికేకలు వినిపించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోను స్థానిక జేఏసీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.