24నుంచి కర్నూలులో రాష్ట్ర కబడ్డీ పోటీలు | kabaddi kabaddi | Sakshi
Sakshi News home page

24నుంచి కర్నూలులో రాష్ట్ర కబడ్డీ పోటీలు

Oct 21 2016 11:55 PM | Updated on Sep 4 2017 5:54 PM

24నుంచి కర్నూలులో రాష్ట్ర కబడ్డీ పోటీలు

24నుంచి కర్నూలులో రాష్ట్ర కబడ్డీ పోటీలు

కర్నూలు జిల్లా నందికొట్కూరు వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14 కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఆదివారం శ్రీకాకుళం నుంచి పయనం అవుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, డీఈఓ డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్‌ శుక్రవారం తెలిపారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: కర్నూలు జిల్లా నందికొట్కూరు వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14 కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఆదివారం శ్రీకాకుళం నుంచి పయనం అవుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, డీఈఓ డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్‌ శుక్రవారం తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఇప్పటికే వెల్లడించామని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులంతా తమ లగేజీతోపాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ వద్దకు ఆదివారం ఉదయం 7 గంటలకు విధిగా  చేరుకోవాలని సూచించారు. వివరాలకు 9440001616  ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు. జిల్లా జట్లకు కోచ్, మేనేజర్లగా పీఈటీలు వై.హరికృష్ణ  (జెడ్పీహెచ్‌ స్కూల్, పీఎం పురం), పి.ప్రశాంతి (కెజీబీవీ, సారవకోట) వ్యవహరిస్తారని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement