24నుంచి కర్నూలులో రాష్ట్ర కబడ్డీ పోటీలు
కర్నూలు జిల్లా నందికొట్కూరు వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14 కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఆదివారం శ్రీకాకుళం నుంచి పయనం అవుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, డీఈఓ డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్ శుక్రవారం తెలిపారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: కర్నూలు జిల్లా నందికొట్కూరు వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14 కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఆదివారం శ్రీకాకుళం నుంచి పయనం అవుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, డీఈఓ డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్ శుక్రవారం తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఇప్పటికే వెల్లడించామని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులంతా తమ లగేజీతోపాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ వద్దకు ఆదివారం ఉదయం 7 గంటలకు విధిగా చేరుకోవాలని సూచించారు. వివరాలకు 9440001616 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. జిల్లా జట్లకు కోచ్, మేనేజర్లగా పీఈటీలు వై.హరికృష్ణ (జెడ్పీహెచ్ స్కూల్, పీఎం పురం), పి.ప్రశాంతి (కెజీబీవీ, సారవకోట) వ్యవహరిస్తారని తెలిపారు.