జీవితంపై అవగాహన అవసరం | Sakshi
Sakshi News home page

జీవితంపై అవగాహన అవసరం

Published Tue, Dec 6 2016 1:53 AM

JEEVITHAMPAI AVAGAHANA AVASARAM

మార్కొండపాడు (చాగల్లు) : ప్రతి ఒక్కరూ ప్రకృతి, సమాజాన్ని పరిరక్షిస్తూ తన సుఖాన్ని సమాజ సుఖంగా పెంపొందించుకోవాలని ఉండ్రాజవరం బౌద్ధధర్మ పీఠం గురువు పూజ్యాబతి అనాలియో అన్నారు. చాగల్లు మండలం మార్కొండపాడులోని  సుంకవల్లి వెంకన్నచౌదరి నివాసంలో సోమవారం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి మనిషికి జీవితంపై అవగాహన కలిగి సన్మార్గంలో పయనించాలని సూచించారు. సత్యాన్వేషి అయిన బుద్ధుని సూక్తులు అందరూ అచరించాలని సందేశమిచ్చారు.  వియత్నం, మలేషియా నుంచి వచ్చిన బౌద్ధులు ఆయనతో ఉన్నారు. సుంకవల్లి ఫౌండేష¯ŒS అధినేత సుంకవల్లి వెంకన్నచౌదరి, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉప్పూలూరి బాబురావు, తమ్మిశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement