రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | in road accident a person ded | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Jul 31 2016 8:09 PM | Updated on Aug 30 2018 4:07 PM

పట్టణంలోని కంచెరోని చెరువు సమీపంలోని జాతీయరహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పట్టణ ఎసై ్స సునీల్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిర్మల్‌ టౌన్‌: పట్టణంలోని కంచెరోని చెరువు సమీపంలోని జాతీయరహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పట్టణ ఎసై ్స సునీల్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన గౌతంరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి ఏపీ25ఎల్‌ 9009 నెంబర్‌ కారులో నిజామాబాద్‌వైపు Ðð ళ్తున్నాడు.
             ఈ క్రమంలో నిజామాబాద్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారును నడుపుతున్న గౌతమ్‌ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మిగతా వారు తీవ్ర గాయాలపాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement