హైస్కూల్‌లో విద్యార్థుల ఘర్షణ | Sakshi
Sakshi News home page

హైస్కూల్‌లో విద్యార్థుల ఘర్షణ

Published Tue, Dec 13 2016 11:49 PM

In high school, students clash

యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో పదో తరగతి చదివే అనిల్‌ అనే వేములపాడుకు చెందిన విద్యార్థి, పిన్నేపల్లికి చెందిన రవి అనే విద్యార్థి ఘర్షణ పడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనలో రవి అనే విద్యార్థి రాయితో దాడి చేయడంతో అనిల్‌ తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. వెంటనే గాయపడ్డ అనిల్‌ను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మూడు కుట్లు పడ్డాయని చెప్పారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు స్పందిస్తూ... తమకు రాతమూలకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. 

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement