భార్యకు నిప్పుపెట్టి హతమార్చిన భర్త | husband killed his wife in nellore city | Sakshi
Sakshi News home page

భార్యకు నిప్పుపెట్టి హతమార్చిన భర్త

Jul 26 2016 10:29 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరులోని సుందరయ్యనగర్‌లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది.

నెల్లూరు : నెల్లూరులోని సుందరయ్యనగర్‌లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. సుమ (26) అనే వివాహితను ఆమె భర్త శ్రీకాంత్ పెట్రోల్ పోసి నిప్పటించి హతమార్చాడు. ఇంట్లోని బాత్రూమ్లో ఒంటిపై కాలిన గాయాలతో సుమ మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి భర్త శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement